కావాల్సినవి : పీతలు - 2 (శుభ్రం చేసి, 4 ముక్కలుగా కట్ చేసి, కాళ్లను విడిగా ఉంచాలి). అల్లం వెల్లుల్లి పేస్టు - ఒకటిన్నర స్పూను, పసుపు - అర టీ స్పూను, కారం - 2 టీ స్పూన్లు, పచ్చిమిర్చి - 3, కరివేపాకు - 4 రెబ్బలు, కొత్తిమీర తరుగు - గుప్పెడు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 5 టీ స్పూన్లు.
మసాలా కోసం : గసగసాలు - ఒకటిన్నర స్పూను, యాలకులు - 2, దాల్చినచెక్క - అంగుళం ముక్క, జీలకర్ర - 1 టీ స్పూను, లవంగాలు - 3, ధనియాలు - 2 టీ స్పూన్లు, ఉల్లిపాయలు - 4 (అన్నీ ముద్దగా నూరిపెట్టుకోవాలి).
తయారీ : నూనెలో పచ్చిమిర్చి, కరివేపాకు వేగాక మసాల ముద్ద, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి 7 నిమిషాలు వేగించాలి. పీతల ముక్కలు, కారం,ఉప్పు కలిపి అరకప్పు నీటిని జతచేసి చిన్నమంటపై నీరంతా ఇగిరిపోయి నూనె పైకి తేలేదాక ఉడికించి, కొత్తిమీర చల్లి దించేయాలి.