రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమా 'ఇస్మార్ట్ శంకర్'. ఇటీవలే చిత్రీకరణ ప్రారంభం అయ్యింది. ఈ చిత్రంలో హీరోయిన్గా నిధి అగర్వాల్ని ఎంపిక చేసినట్లు దర్శకుడు వెల్లడించారు. అందం అభినయంతో ఆకట్టుకున్న నిధి అగర్వాల్కి తెలుగులో ఇది మూడో సినిమా. ఇటీవలే ఆమె కథానాయికగా నటించిన 'మిస్టర్ మజ్ను' చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీనికి ముందు 'సవ్యసాచి'లో నటించింది. 'ఇస్మార్ట్ శంకర్' చిత్రం ప్రస్తుతం హైదరాబాద్లో భారీ యాక్షన్ సీన్లు చిత్రీకరణ జరుపుకుంటుంది. హీరో రామ్ షూటింగ్లో పాల్గొంటున్నాడు. రియల్ సతీష్ ఈ యాక్షన్ ఎపిసోడ్కి కొరియోగ్రఫీ చేస్తున్నాడు. త్వరలో నిధి అగర్వాల్ షూటింగ్లో పాల్గొననుంది. పునీత్ ఇస్సార్, సత్య దేవ్, మిలింద్ గునాజీ, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ పతాకాలపై పూరీ జగన్నాథ్్, ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాఉ. ఈ సినిమాని మేలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
'ఇస్మార్ట్ శంకర్' హీరోయిన్ నిధి అగర్వాల్
