- విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులొద్దు
- ఇసుక పాలసీపై స్పష్టమైన వైఖరి చెప్పాలి
- సీడబ్ల్యూఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షులు ఆర్.సింగార వేలు
- బీసీడబ్ల్యూయూ రాష్ట్ర మహాసభ ప్రారంభం
ప్రజాశక్తి - హైదరాబాద్
భవన నిర్మాణ రంగం కార్మికుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలని కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (సీడబ్ల్యూఎఫ్ఐ) అఖిల భారత అధ్యక్షులు ఆర్.సింగార వేలు డిమాండ్ చేశారు. తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం తొలి రాష్ట్ర మహాసభ నల్లగొండలో బుధవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో నిర్వహిం చిన బహిరంగ సభలో సింగార వేలు ప్రసంగించారు. రాష్ట్రంలో సెస్ ద్వారా సంక్షేమ బోర్డులో ఉన్న నిధులు కార్మి కుల సంక్షేమానికి ఖర్చు చేయకుండా ఇతర రంగాలకు మళ్లిం చడం సరికాదన్నారు. ఈ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబ డులను అనుమతించొద్దన్నారు. సిమెంట్, ఐరన్, రంగులు, ఇతర ముడి సరుకుల ధరలు నియంత్రించి వాటిని ప్రభుత్వ మే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం లో 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు 18 రకాల విభాగాల్లో పని చేస్తున్నారని తెలిపారు. అందులో 8 లక్షల మంది కార్మికుల పేర్లు మాత్రమే సంక్షేమ బోర్డులో నమోదై ఉన్నాయని చెప్పారు. ఇసుక పాలసీపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు మాట్లాడుతూ.. ఇసుక దొరక్క పనులు లేక భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల పోషణ భారమై అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మరికొంత మంది వలసలు పోతు న్నారన్నారన్నారు. అడ్డాల ఏర్పాటు, ఆయా ప్రాంతాల్లో మౌ లిక వసతులు కల్పించాల్సిన లేబర్ శాఖ అధికారులు చోద్యం చేస్తున్నారని విమర్శించారు. సంక్షేమ బోర్డు ద్వారా కార్మికు లకు గుర్తింపు కార్డులివ్వాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లా డుతూ.. పెట్టుబడిదారులు, బడా వ్యాపారులకు రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం కార్మికులకు మాత్రం కూలి పెంపు, రుణాలివ్వడం లేదన్నారు. సెప్టెంబర్ 2న నిర్వహించనున్న దేశ వ్యాప్త సమ్మెలో భవన నిర్మాణ కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సభలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు పాలడుగు భాస్కర్, వంగూరి రాములు, బీసీడబ్ల్యూయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రాజు, సీఐటీ యూ జిల్లా అధ్యక్షులు ఎమ్డి.సలీం, చినపాక లక్ష్మీ నారా యణ, మందడి సులోచన తదితరులు పాల్గొన్నారు.
నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమానికి బడ్జెట్లో నిధులు పెంచాలి
